telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు సామాజిక సినిమా వార్తలు

సన్నీ లియోన్ కంటే ధోని, సచిన్ లే డేంజరస్ అంట…!?

sunny

ఇటీవల కాలంలో ఇంటర్నెట్ వాడకం ఎక్కువైపోయింది. అయితే ఇంటర్నెట్ లో ఏదైనా వార్త కోసం సెర్చ్ చేసేటపుడు నకిలీ లింకులు తగలడం సర్వ సాధారణం. వాటిని ఓపెన్ చేస్తే ఎక్కవమటుకు అశ్లీల, డేంజరస్ వె‌బ్ సైట్లకు దారి తీస్తుంటాయి. ఇక నెటిజన్స్ తమ ఫేవరేట్ యాక్టర్స్, పొలిటిషన్స్, సమాచారం కోసం వెబ్‌సైట్లను వెతుకుతుంటారు. ఇదే అదనుగా వారిని లక్ష్యంగా ఎంచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోనికి దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. అతడి గురించి తెలుసుకోవడానికి అభిమానులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు. ఈ నేపథ్యంలో ధోని నెటింట్లో అత్యంత డేంజరస్ వ్యక్తిగా మారిపోయాడు. ఎం.ఎస్.ధోని అని మనం నెట్లో వెతికినపుడు అశ్లీల వెబ్‌సెట్స్ లింకులు రీ డైరెక్ట్ అవుతున్నాయని మెకాఫీ అనే సంస్థ తన సర్వేలో వెల్లడించింది. ఇలాంటి సెలెబ్రిటీల జాబితాలో ఎవరెనున్నారో ఓ నివేదిక సిద్ధం చేసింది. ఇందులో సన్ని లియోన్, రాధిక ఆప్టే, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, శ్రద్ధా కపూర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, ఇందులో ప్రధానంగా ఉన్నారు. ఇందులో ధోనీ, టెండూల్కర్ మొదటి రెండు స్థానాల్లో ఉండగా..బాలీవుడ్ తార సన్నిలియోన్ మాత్రం నాల్గో ప్లేస్‌లో నిలిచింది. ఇక టీవీ సెలబ్రిటీ గౌతమ్ గులాటి ఆమె కన్న ముందు 3 స్థానంలో ఉండటం విశేషం. ఎక్కువ మంది నెటిజన్లు వీరి కోసం తెలుసుకోవాలనే ఆరాటంలో వెతుకుంటారు. 

Related posts