ఏపీలో విజయవాడ స్వర్ణ ప్యాలెస్, రమేష్ కోవిడ్ కేర్ సెంటర్ ప్రమాదంపై వివాదం ముదురుతోంది. ఈ వ్యవహారంపై టాలీవుడ్ హీరో రామ్ చేసిన ట్వీట్లు వైరల్ అయ్యాయి. ముఖ్యమంత్రి జగన్పై కుట్ర జరుగుతోందని, కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. అలాగే కులం పేరుతో ఆయన చేసిన ట్వీట్లపై పెద్ద చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే రామ్కు చంద్రబాబుతో పాటూ టీడీపీ నేతలు మద్దతుగా నిలిచారు. తాజాగా ఈ వ్యవహారంపై మాజీ మంత్రి దేవినేని ఉమా స్పందించారు. “32 ఏళ్లుగా 2వేలకుపైగా సిబ్బందితో, నెలకి 20వేల ఓపీలు, 1500 పైగా ఇన్ పేషెంట్స్కి సేవలు, ,25,000పైగా cath, 20 వేలకుపైగా శస్త్రచికిత్సలు చేసి ప్రాణాలు కాపాడిన రమేష్ హాస్పిటల్స్. ట్విట్టర్లో పోస్ట్ పెట్టిన హీరో రామ్కు బెదిరింపులా.. ఎంతోమందికి ప్రాణదాత రమేష్ను అరెస్టు చేసేందుకు ఎందుకంత ఉత్సాహం జగన్ గారూ ?” అంటూ ప్రశ్నించారు దేవినేని ఉమా.
32ఏళ్లుగా2వేలకుపైగా సిబ్బందితో నెలకి20వేల ఓపీ,1500పైగా ఇన్ పేషెంట్స్ కి సేవలు.1,25,000పైగా cath,20వేలకుపైగా శస్త్రచికిత్సలుచేసి ప్రాణాలుకాపాడిన రమేష్ హాస్పిటల్స్.ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిన@ramsayzకు బెదిరింపులా?ఎంతోమందికిప్రాణదాత రమేష్ ను అరెస్టుచేసేందుకు ఎందుకంతఉత్సాహం@ysjagan pic.twitter.com/MXtf4jRoRJ
— Devineni Uma (@DevineniUma) August 17, 2020
దాని కోసమే పెళ్ళి చేసుకున్నా… బోల్డ్ హీరోయిన్ కామెంట్స్