telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ సినిమా వార్తలు

హీరో రామ్‌కు బెదిరింపులా… ఎందుకంత ఉత్సాహం జగన్ గారూ ? : మాజీ మంత్రి దేవినేని ఉమా

Devineni-uma

ఏపీలో విజయవాడ స్వర్ణ ప్యాలెస్, రమేష్ కోవిడ్ కేర్ సెంటర్ ప్రమాదంపై వివాదం ముదురుతోంది. ఈ వ్యవహారంపై టాలీవుడ్ హీరో రామ్ చేసిన ట్వీట్లు వైరల్ అయ్యాయి. ముఖ్యమంత్రి జగన్‌పై కుట్ర జరుగుతోందని, కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. అలాగే కులం పేరుతో ఆయన చేసిన ట్వీట్‌లపై పెద్ద చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే రామ్‌కు చంద్రబాబుతో పాటూ టీడీపీ నేతలు మద్దతుగా నిలిచారు. తాజాగా ఈ వ్యవహారంపై మాజీ మంత్రి దేవినేని ఉమా స్పందించారు. “32 ఏళ్లుగా 2వేలకుపైగా సిబ్బందితో, నెలకి 20వేల ఓపీలు, 1500 పైగా ఇన్ పేషెంట్స్‌కి సేవలు, ,25,000పైగా cath, 20 వేలకుపైగా శస్త్రచికిత్సలు చేసి ప్రాణాలు కాపాడిన రమేష్ హాస్పిటల్స్. ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టిన హీరో రామ్‌కు బెదిరింపులా.. ఎంతోమందికి ప్రాణదాత రమేష్‌ను అరెస్టు చేసేందుకు ఎందుకంత ఉత్సాహం జగన్ గారూ ?” అంటూ ప్రశ్నించారు దేవినేని ఉమా.

Related posts