యంగ్ హీరో సందీప్ కిషన్ తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ‘వివాహ భోజనంబు’ అనే రెస్టారెంట్లు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తన రెస్టారెంట్ పేరు ‘వివాహ భోజనంబు’తో ఓ సినిమా నిర్మించడానికి సందీప్ కిషన్ శ్రీకారం చుట్టారు. వెంకటాద్రి టాకీస్, సోల్జర్స్ ఫ్యాక్టరీ పతాకాలపై రూపొందనున్న ‘వివాహ భోజనంబు’ చిత్రానికి సందీప్ కిషన్, శినీష్ నిర్మాతలు. ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత పి. కిరణ్ (జెమిని కిరణ్) సగర్వంగా సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకుడు. సోమవారం సినిమా ప్రీ–లుక్ విడుదల చేశారు. త్వరలో ఫస్ట్ లుక్తో పాటు ఈ సినిమాలో హీరో, హీరోయిన్, ఇతర నటీనటుల వివారాలను వెల్లడించనున్నారు. కాగా తన సినిమా ప్రీ లుక్ పోస్టర్ను ట్విట్టర్ ద్వారా సందీప్ కిషన్ అభిమానులతో పంచుకున్నారు. నిజానికి బిగ్ న్యూస్ చెబుతానంటూ ‘‘బిగ్ న్యూస్ అనగానే పెళ్లి అని ఫిక్స్ అయిపోయారు కదా.. లాక్డౌన్ మహిమ’’ అని ఈ ట్వీట్లో సందీప్ సరదాగా పేర్కొన్నారు. సూపర్ హిట్ మూవీ ‘నిను వీడని నీడను నేనే’తో సందీప్ కిషన్ నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. వెంకటాద్రి టాకీస్ నిర్మాణ సంస్థను స్థాపించి తొలి చిత్రంగా ‘నిను వీడని నీడను నేనే’ను నిర్మించారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న ‘ఏ1 ఎక్స్ప్రెస్’లో సందీప్ కిషన్ నిర్మాణ భాగస్వామి. వెంకటాద్రి టాకీస్ సంస్థలో అది రెండో చిత్రం. ఇప్పుడు మూడో సినిమాగా ‘వివాహ భోజనంబు’ను నిర్మిస్తున్నారు.
Big News Anagane Pelli ani Fix ayipoyeru kadaa🙄
LockDown Mahimaa 😂Humbly Presenting to you the Pre-Look of#VivahaBhojanambu
Dir By @RamAbbaraju ❤️
1 of my Favourite actors will Debut as a Hero,
Guess Who? 😉@SoldiersFactory @AnandhiArtoffl@TalkiesV#Sk #SingleKing 🤟🏽 pic.twitter.com/JgsvCWwzkc
— Sundeep Kishan (@sundeepkishan) August 17, 2020