telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

చంద్రబాబు, జగన్‌ల నుంచి తనకు ప్రాణహాని: కేఏ పాల్ 

RGV Counter to KA Paul
ప్రముఖ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనకు రక్షణ కల్పించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌ను కోరారు.  అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత  వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. వారిద్దరూ తన హత్యకు కుట్ర కుట్రపన్నుతున్నారని, తనకు భద్రత కల్పించాలని పోలీస్ కమిషనర్ ను కోరారు. 
మంగళవారం సీపీని కలిసిన కేఏ పాల్ తనపై చేస్తున్న అసత్య ప్రసారాలు, యూట్యూబ్‌ చానళ్లలో తనపై పోస్టు చేస్తున్న కామెడీ క్లిప్లింగులను ఆయనకు అందించారు. మొత్తంగా వంద యూట్యూబ్ చానళ్లు, కొన్ని వెబ్‌సైట్లు, కొంతమంది వ్యక్తులపై ఫిర్యాదు చేశారు. తనపై అసత్య ప్రసారాలు చేస్తున్న అందరిపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలుస్తానని కేఏ పాల్ తెలిపారు.

Related posts