telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ సినిమా వార్తలు

మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు కన్నుమూత

Penumatsa Samba siva raju

నటుడు కృష్ణుడు తన తాత పెన్మత్స సాంబశివరాజు ఇకలేరని ట్విట్టర్ ద్వారా తెలిపారు. “మా తాతగారు పెన్మత్స సాంబశివరాజుగారు ఈ రోజు మృతి చెందారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నాయకుడాయన. సివిల్ సప్లయ్ మినిస్టర్, ట్రాన్స్‌ఫోర్ట్, సుగర్ ఇండస్ట్రీస్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ మినిస్టర్ వంటి ఎన్నో పదవులను ఆయన అలంకరించారు. ప్రజల సంక్షేమం కోసం ఎంతగానో పోరాడిన గొప్ప నాయకుడు” అని కృష్ణుడు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు (87) అనారోగ్యంతో విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి రాజకీయ కురువృద్ధుడుగా ఆయన గుర్తింపు పొందారు. అలాగే మంత్రి బొత్సకు రాజకీయ గురువుగా కూడా ఈయనను చెప్పుకుంటారు. 

Related posts