ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేపై అర్ధరాత్రి దుండగులు కాల్పులు జరిపారు. మెహ్రౌలీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన నరేశ్ యాదవ్ దేవుని దర్శనం కోసం ఆలయానికి వెళ్లారు.
అనంతరం కాన్వాయ్లో ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అశోక్ మన్ అనే కార్యకర్త చనిపోగా, మరొకరు గాయపడ్డారు. ఎమ్మెల్యే నరేశ్ యాదవ్ ప్రాణాలతో బయపటడ్డారు. ‘ఆప్’ కుటుంబ సభ్యులలో ఒకరిని కోల్పోయామని ఆ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది.