గత ప్రభుత్వ హయాంలో ముస్లిం యువకులు, ప్రత్యేక ఉద్యమ కారులపై పెట్టిన అక్రమ కేసులన్నింటిపైనా విచారణ జరిపి ఎత్తివేస్తామని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. బుధవారం ఆమె సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ గత టిడిపి ప్రభుత్వం చాలా మందిపై అక్రమంగా రౌడీషీట్లు తెరిచి వేధించిందని ఆరోపించారు.
చంద్రబాబు సభలో నినాదాలు చేశారని ముస్లిం యువకులపై దేశ ద్రోహకేసులు పెట్టారన్నారు. ఈ విషయాన్ని ముస్లిం యువకులు తమ దృష్టికి తీసుకురాగా, విచారణలో 9మంది యువకులపై ఉన్న కేసులన్నీ అక్రమమని తేలిందన్నారు. సోషల్ మీడియా వారిపై కూడా అక్రమ కేసులు పెట్టారని, వీటన్నింటిపైనా విచారణ జరిపి ఎత్తివేస్తామని మంత్రి స్పష్టం చేశారు.