వచ్చే ఏడాది ప్రారంభంలో ఇంగ్లండ్ భారత పర్యటన సందర్భంగా జరగనున్న డే-నైట్ పింక్ బాల్ టెస్టుకు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇస్తుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. టెస్ట్ ర్యాంకింగ్స్లో 4వ ర్యాంకు, వన్డే ఫార్మాట్లో నంబర్ వన్ అయిన ఇంగ్లాండ్ మార్చి లో 5 టెస్టులు, పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత్ ను సందర్శించనుంది. “అహ్మదాబాద్ డే-నైట్ టెస్ట్ నిర్వహిస్తుంది” అని దాదా కోల్కత ప్రెస్ క్లబ్లోని ఒక కార్యక్రమంలో చెప్పారు.
అయితే భారతదేశంలో కరోనా వైరస్ కారణంగా, ప్రస్తుతం ఇండియన్ పెర్మియర్ లీగ్ (ఐపీఎల్) యొక్క 13 వ ఎడిషన్కు ఆతిథ్యం ఇస్తున్న యుఎఇ, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్కు కూడా ఆతిథ్యం ఇస్తుందని అందరూ అనుకున్నారు. కానీ బీసీసీఐ భారతదేశంలోనే ఇంగ్లాండ్కు ఆతిథ్యం ఇవ్వాలని నిశ్చయించుకుంది. అహ్మదాబాద్, ధర్మశాల మరియు కోల్కత టెస్ట్ సిరీస్కు మూడు వేదికలు కావచ్చు. కానీ బోర్డు ఇంకా తుది పిలుపునివ్వలేదని సౌరవ్ గంగూలీ చెప్పారు. టీమిండియా రాబోయే ఆస్ట్రేలియా పర్యటనకు బీసీసీఐ ఇప్పుడు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందని భారత మాజీ కెప్టెన్ తెలిపారు.