ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు పంచాయితీ రాజకీయాల రభస పెరుగుతుంది. ఏపీలో పార్టీలు ప్రత్యర్థుల పై విమర్శాహాలు గుపిస్తున్నాయి. చంద్రబాబు పై వెల్లంపల్లి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ ఆదేశాలు అప్రజాస్వామికం అని పేర్కొన్న ఆయన గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎన్నికల కమిషనర్ ను నేరుగా బెదిరించారని, చర్యలు తీసుకోవాల్సి వస్తే చంద్రబాబును ఉరి వేయాలని అన్నారు. తప్పులు చేసే అధికారులను బ్లాక్ లిస్ట్ లో పెడతాం అనటం తప్పెలా అవుతుంది? అని ప్రశ్నించిన ఆయన ఎవరికీ భయ పడాల్సిన అవసరం లేదన్నారు. ఇక ప్రజా ప్రతినిధుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తే ఊరుకోమని, నిమ్మగడ్డ కు మేము కూడా తగిన బుద్ధి చెబుతామని అన్నారు. న్యాయం జరిగే వరకు పోరడతామన్నారుఆయన. ఇక ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ నిమ్మగడ్డ ని ఎర్రగడ్డ హాస్పిటల్ లో చేర్చాలని అన్నారు. నిమ్మగడ్డ దుర్మార్గుడు, దుష్టుడు అని పేర్కొన్న ఆయన ప్రశాంత వాతావరణంలో ఎన్నికల జరుగుతుంటే మంత్రి పెద్దిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయమని ఆదేశించటం అప్రజాస్వామికం అని అన్నారు. ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తామని ఆయన అన్నారు. చూడాలి మరి ఈ వ్యాఖ్యల పై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారు అనేది.
next post