telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ 2021 : బెంగళూరు ఖాతాలో రెండో ఓటమి…

ఈరోజు ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టులో గేల్(46) రెచ్చిపోయాడు. అలాగే ఆ జట్టు కెప్టెన్ రాహుల్ 91 పరుగులు చేసి చివరి వరకు నాట్ ఔట్ గా నిలిచాడు. అతనికి తోడు ఆఖర్లో హర్‌ప్రీత్ బ్రార్ (25) రాణించడంతో పంజాబ్ నిర్ణిత  20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ఇక 180 పరుగుల లక్ష్యంతో దిగ్గిన బెంగళూరు జట్టుకు దేవదత్ పడిక్కల్ (7)ను ఔట్ చేసి మొదటి షాక్ ఇచ్చారు పంజాబ్ బౌలర్లు. కానీ ఆ తర్వాత విరాట్ కోహ్లీ (35), మాక్స్వెల్ ను వరుస బంతులకు డివిలియర్స్ ను ఔట్ చేసి బెంగళూరును కోలుకోలేని దెబ్బ కొట్టాడు హర్‌ప్రీత్ బ్రార్.ఇక చివరి లో హర్షల్ పటేల్(31) పరుగులు చేసిన అప్పటికే రన్ రేట్ బాగా పెరిగింది. దాంతో కోహ్లీసేన నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రం చేసింది. ఇక ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది పంజాబ్. అలాగే ఈ సీజన్ లో రెండో ఓటమిని ఖాతాలో వేసుకున్న బెంగళూరు 3వ స్థానంలో అలాగే ఉంది. 

Related posts