తెలంగాణ లో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క టీ ఆర్ ఎస్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. మెదక్ జిల్లాలో ఈ రోజు భట్టి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా యుద్ధం చేయాల్సిన సీఎం ఫామ్హౌస్లో పడుకున్నారని భట్టి ఆరోపించారు.
మంత్రి ఈటల రాజేందర్ సైన్యం ఆయన మాట వినడం లేదని ఆయన ఉత్సవ విగ్రహంలా మారారని దుయ్యబట్టారు. మిగతా మంత్రులంతా భజనపరులని అన్నారు. ఏరియా ఆస్పత్రిలో 172 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసమని అన్నారు. మరి ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
పరారీలో ఉండాల్సిన అవసరం మా ఆయనకు లేదు: అఖిలప్రియ