పాకిస్థాన్ నుంచి విశాఖకు ముప్పేమీ లేదని, అసలు ముప్పు వైసీపీ నుంచేనని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని ట్విట్టర్ లో విమర్శించారు.”పాకిస్థాన్ నుండి విశాఖను రక్షించేందుకు భారత దేశ సైన్యం వుంది. కాని విశాఖకు అసలు ముప్పు ప్రస్తుతం మన జగన్నన అండ్ గ్యాంగ్ నుంచే ఉందని ఆయన పేర్కొన్నారు.
జగన్నన అండ్ గ్యాంగ్ నుంచి విశాఖను దేవుడే రక్షించాలి” అని విజయవాడ కేశినేని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. ఓ దినపత్రికలో “విశాఖపై పాకిస్థాన్ కన్నెందుకు?” అంటూ ప్రచురితమైన ఓ కథనాన్ని ఉంచారు.
ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్న కేసీఆర్: భట్టి విక్రమార్క