telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

చేతబడి అనుమానంతో అల్లుడినే సజీవ దహనం బంధువులు

జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చేతబడి చేయించాడనే అనుమానం తో ఓ యువకుడిని అతని బంధువులు సజీవ దహనం చేశారు. ఈ ఘటన మల్యాల మండలం బల్వంతపూర్ లో చోటుచేసుకుంది. మృతి చెందిన వ్యక్తి పేరు పవన్ కాగా…  అతను హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగి అని తెలుస్తోంది. చేతబడి, కుటుంబ గొడవల నేపథ్యంలో పవన్ ను గదిలో బంధించి పెట్రోల్ పోసి నిప్పంటించారు బంధువులు. 12 రోజుల క్రితం మృతుడి బామ్మర్ది జగన్ అనారోగ్యంతో మృతి చెందగా…. కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు భార్య కృష్ణవేణి తో వచ్చాడు పవన్. పవన్ చేతబడి చేయించి అతడిని చంపించడానే కారణంతోనే బంధువులు చంపారని సమాచారం అందుతోంది. సజీవ దహనంలో బయటి వారు కూడా పాల్గొని ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుడి భార్య క్రిష్ణ వేణి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts