telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

కిక్కు కోసం రసాయన ద్రావణం తాగి ఇద్దరు మృతి

liquor bottle

లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో మందు బాబులు మద్యం దొరకక నానా తంటాలు పౌడుతున్నారు. ఈ క్రమంలో మద్యం అలవాటున్న ఇద్దరు వ్యక్తులు మత్తు కోసం రసాయన ద్రావణంలో నీళ్లు కలుపుకుని తాగి ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో నిన్న ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన షేక్‌బాబా (35), రియాజ్ (22)లు ప్లాస్టిక్ బొమ్మలు విక్రయిస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు.

మంగళవారం రాత్రి వీరిద్దరూ ప్లాస్టిక్ డ్రమ్మును శుభ్రం చేసేందుకు రసాయన ద్రావణాన్ని ఉపయోగించారు. ఈ క్రమంలో అది స్పిరిట్ వాసన రావడంతో మత్తు కలిగిస్తుందన్న ఉద్దేశంతో అందులో నీళ్లు కలుపుకుని తాగారు. నిన్న ఉదయం వీరు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వెంటనే జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.

Related posts