బాలీవుడ్ దిగ్గజనటుడు రిషికపూర్(67) కన్నుముశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో భాదపడుతున్న రిషి కపూర్ బుధవారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రిషికపూర్ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. భార్య నీతూకపూర్, రిషికపూర్ సోదరుడు రణధీర్ కపూర్, రిషికపూర్ కుమారుడు రణబీర్ కపూర్ రిషి మరణ వార్త విని వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. 1952 సెప్టెంబర్ 4 రిషి ముంబైలో జన్మించారు.. ప్రముఖ నటుడు రాజ్ కపూర్ కి రిషి రెండో కుమారుడు..మేరా నామ్ జోకర్ మూవీలో బాలనటుడిగా సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టిన రిషి బాబీ మూవీతో హీరోగా అరంగేట్రం చేశారు.. ఆయన అనేక హిట్ సినిమాల్లో నటించారు.1980లో సహ నటి రితూ సింగ్ ను ఆయన వివాహం చేసుకున్నారు. రిషికి ఇద్దరు పిల్లలు. కుమారుడు రణబీర్ కపూర్, కుమార్తె రిథిమా
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రిషి కపూర్ చివరిసారిగా ఏప్రిల్ 2న ట్విట్టర్లో ఒక పోస్టు పెట్టారు. తన ఆరోగ్యం పట్ల కుటుంబం,అభిమానులు,స్నేహితులు చూపుతున్న శ్రద్దకు తాను చాలా సంతోషిస్తున్నానని అందులో తెలిపారు. అదే అతడి చివరి పోస్ట్. ఇటీవలే తన కొత్త సినిమా ప్రాజెక్టును కూడా ప్రకటించారు. హాలీవుడ్లో చేయబోయే ‘ది ఇంటర్న్’ అనే ఆ సినిమాలో దీపికా పదుకొణేతో కలిసి నటించబోతున్నారు. ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. కాగా రిషి మరణం పట్ల పలువురు సంతాపం ప్రకటించారు. ఏప్రిల్ 29 బుధవారం బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతిచెందిన షాక్ నుంచి ఇంకా ఎవరూ బయటకు రాకముందే…రిషి మరణవార్త వినాల్సి వచ్చింది. ఇర్ఫాన్ ఖాన్ కూడా కొన్నేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో పోరాటం చేస్తూనే మృతిచెందారు.