ఏబీ వెంకటేశ్వరరావు సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ కు లేఖ రాశారు. తనపై ప్రభుత్వం మోపిన అభియోగాలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆ లేఖలో ఏబీవీ పేర్కొన్నారు. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ చేపట్టిన విచారణ సందర్భంగా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని సీఎస్కు ఏబీవీ లేఖ రాశారు. డీజీపీ సహా పోలీసు శాఖకు చెందిన వివిధ ఉన్నతాధికారులు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని సీఎస్కు ఆ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. తనకు వ్యతిరేకంగా కృత్రిమ డాక్యుమెంట్ల సృష్టిలో డీజీపీ సహా పలువురు ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని ఏబీవీ పేర్కొన్నారు. డీజీపీతో పాటు ఏసీబీ డీజీ పీఎస్సార్ ఆంజనేయులు, సీఐడీ ఛీఫ్ సునీల్ కుమార్ ల పైనా ఏబీవీ ప్రధానంగా ఆరోపణలు చేశారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన వారికి అప్పటి సీఎస్ నీలం సాహ్నీ, సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సహకరించారని ఆరోపణలు చేశారు. ప్రభుత్వం మోపిన అభియోగాలకు వ్యతిరేకంగా ఆధారాలను సీఎస్ కు అందించిన ఏబీవీ…. సీబీఐతో దర్యాప్తు చేయించకుంటే సుప్రీంకు వెళ్తానని లేఖలో పేర్కోన్నారు. అయితే చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post