telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టెండర్లు పిలవకుండా అంతర్వేదిలో రథ నిర్మాణం: లోకేశ్

Lokesh Tdp

టెండర్లు పిలవకుండా అంతర్వేదిలో రథ నిర్మాణం ప్రారంభించి అగ్నికుల క్షత్రియుల మనోభావాలు దెబ్బతిస్తున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. ఆలయాలపై జరుగుతోన్న దాడులను ఉద్దేశించి లోకేశ్ ట్విటర్ లో విమర్శలు గుప్పించారు. వైకాపా ప్రభుత్వ వ్యవహారశైలిలో మార్పు రాలేదని లోకేశ్ మండిపడ్డారు.

‘దేవుడి విగ్రహం ధ్వంసం అయితే కొత్త విగ్రహం పెడతాం. వెండి విగ్రహాలు పోతే నష్టం ఏంటి? కోటి రూపాయల రథం తగల బడితే దేవుడికి నష్టం ఏంటి అని భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వైకాపా ప్రభుత్వ వ్యవహారశైలిలో మార్పు రాలేదు’ అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. నూతన రధ నిర్మాణం కోసం తక్షణమే అధికారులు టెండర్లు ఆహ్వానించాలి. రథ నిర్మాణంలో స్థానిక అగ్నికుల క్షత్రియులకు ప్రాధాన్యత ఇవ్వాలి’ అని లోకేశ్ డిమాండ్ చేశారు.

Related posts