telugu navyamedia
రాజకీయ

సైనిక యోధుడికి భారత జాతి అంతిమ వీడ్కోలు..

హెలికాప్టర్​ ప్రమాదంలో మరణించిన సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్​, ఆయన సతీమణి మధులికాల అంతిమయాత్ర కొన‌సాగుతుంది. ఢిల్లీ కామ్రాజ్ మార్గ్ లోని రావత్ నివాసం నుంచి వారి భౌతికకాయాలనుంచిన వాహనం ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్ స్క్వేర్‌లోని శ్మశానవాటికవరకు అంతిమ యాత్ర సాగనుంది.

LIVE: 'Jab tak suraj chaand rahega, Bipin ji ka naam rahega' slogans raised  as the cortège of CDS proceeds in Delhi | India News | Zee News

ఆ తర్వాత సైనిక లాంఛనాలతో రావత్​ దంపతుల అంత్యక్రియలు జరగనున్నాయి . అలాగే నేతలు, సైనికులు పెద్ద సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొంటున్నారు. దారిపొడవున ప్రజలు జెండాలతో వారికి సెల్యూట్​ చేస్తున్నారు.

 

మరోవైపు రావత్​ దంపతులకు వారి కుమార్తెలు కృతిక, తరణి నివాళులర్పించారు. తల్లిదండ్రుల భౌతికకాయాలపై పూల రేకులు జల్లి అంతిమ వీడ్కోలు పలికారు. తండ్రితో అనుబంధం, దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

Related posts