telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీకి పెరిగిన వలస… మరో కాంగ్రెస్‌ లీడర్

తెలంగాణ బీజేపీలోకి వలసలు పెరిగాయి. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఇందుకు కారణం. ఆ సమయంలోనే తెలంగాణలో తమ పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టిసారించారు. తమ పార్టీలోని కీలక నేతలను రంగంలోకి దింపి.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో నిరుత్సాహంగా ఉన్నవాళ్లు.. యాక్టివ్ పాలిటిక్స్‌కు కాస్త దూరంగా ఉంటున్నవారిని ఎంచుకుని మరీ ఇంటికి వెళ్లి పలుకరిస్తున్నారు. ఆ మాట.. ఈ మాట మాట్లాడి.. పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు.. బీజేపీ తీర్థం పుచ్చుకోగా.. ఇప్పుడు మరో నేత కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమైపోయింది..  ఉమ్మడి ఏపీలో మంత్రిగా సేవలు అందించిన డా.ఎ.చంద్రశేఖర్.. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. కొన్ని రోజుల తర్వాత కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నా అంత యాక్టివ్‌గా లేరు. అయితే ఇవాళ చంద్రశేఖర్ ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీ నేత డీకే అరుణ. దీంతో… త్వ‌ర‌లోనే భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు మాజీ మంత్రి. కేంద్ర పార్టీ పెద్ద‌ల స‌మ‌క్షంలో ఆపార్టీ కండువా కప్పుకోనున్నారు. గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన వికారాబాద్‌లో భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేసి… బీజేపీలో చేరనున్నట్టు చంద్ర‌శేఖ‌ర్ తెలిపారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts