ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. కాగా మొదటి రోజు అసెంబ్లీకి రాలేకపోయిన నర్సరావుపేట శాసనసభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి రెండోరోజు ప్రమాణం చేశారు.
నేడు స్పీకర్గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. నేడు అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించనున్నారు. తమ్మినేని ఆముదాలవలస ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడు సార్లు మంత్రిగా పని చేశారు. స్పీకర్ ఎన్నికకు ప్రతిపక్షం మద్దతు కూడా తీసుకోనున్నారు.