తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా సిద్దం సిద్దమైనట్టు తెలుస్తోంది. రేపు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 10 మంది అభ్యర్థుల పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. ఆదిలాబాద్, మహబూబాబాద్ సీట్లపై పార్టీ కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు 10 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితా కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఆయా నియోజకవర్గాలపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
పార్టీ పరిశీలిస్తున్న అభ్యర్థుల జాబిత..
1. నల్గొండ… కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి… రఘువీర్ రెడ్డి.
2. భువనగిరి… మధుయాష్కీ
3. మహబూబాబాద్… బెల్లయ్య నాయక్, బలరాం నాయక్
4. హైదరాబాద్… ఫిరోజ్ ఖాన్
5. సికింద్రాబాద్… అంజన్ కుమార్ యాదవ్
6. మహబూబ్ నగర్… డీకే అరుణ, రేవంత్ రెడ్డి, అనిరుద్ రెడ్డి
7.నాగర్ కర్నూల్… నంది ఎల్లయ్య, మాజీ ఎమ్మెల్యే సంపత్, మల్లు రవి
8. చేవెళ్ల … విశ్వేశ్వరరెడ్డి
9. ఆదిలాబాద్…సోయం బాబు రావు, రమేష్ రాథోడ్
10. జహీరాబాద్.. మదన్ మోహన్ రావు