telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వం చేసే పిచ్చి పనుల్లో కేంద్రం జోక్యం చేసుకోదు: కన్నా

Kanna laxminarayana

తాము అభివృద్ధి వికేంద్రీకరణనే కోరుకున్నామని బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే పిచ్చి పనుల్లో కేంద్రం జోక్యం చేసుకోదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో తీసుకునే నిర్ణయాలకు ముఖ్యమంత్రే బాధ్యత వహిస్తాడని అన్నారు.

సీఎం మారినప్పుడల్లా రాజధాని మారుతుందనేది జగన్ నాయకత్వంలో మొదటిసారి చూస్తున్నానని పేర్కొన్నారు. రాజధానిపై వైసీపీ నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా, సీఎం మారితే ప్రభుత్వ విధానాలు మారతాయా? అంటూ కన్నా అసహనం వ్యక్తం చేశారు.ఒకరు మూడు రాజధానులంటారు, మరొకాయన పదంటారని విమర్శైంచారు.

ఇష్టంవచ్చినట్టు రాజధానిని మార్చే హక్కు ప్రజలు ఇవ్వలేదు అంటూ మండిపడ్డారు. ఏదేమైనా ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ప్రజాధనాన్ని ఇష్టంవచ్చినట్టు దుర్వినియోగం చేయొద్దని హితవు పలికారు.చంద్రబాబుపై ఉన్న కక్షతో ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నించారు.

Related posts