telugu navyamedia
రాజకీయ వార్తలు

నేడు వాజ్ పేయి జయంతి.. కొత్త పథకాన్ని ప్రారంభించిన మోదీ

modi on jammu and kashmir rule

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నేడు ‘అటల్ భూజల్ యోజన’కు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఈ పథకానికి తక్షణమే రూ. 6 వేల కోట్లను కేటాయిస్తున్నట్టు తెలిపారు.

దేశంలోని భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంతో వాజ్ పేయి ఎంతో తపించారని చెప్పారు. ఆయన కోరిక తన కలగా మిగిలిందని  వ్యాఖ్యానించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ఏడు రాష్ట్రాలకు పథకం మేలు కలిగిస్తుందని తెలిపారు.

ఇకపై గ్రామ పంచాయితీ స్థాయిలోనే, తమతమ గ్రామాల పరిధిలో భూగర్భ జలాలను ఎలా పెంచుకోవాలన్న అంశంపై చర్చించి నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. భూగర్భ జలాలను పెంచడం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

Related posts