telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

చేయి ఊపిన ఆగని కారు.. హుజూర్ నగర్ లో సైదిరెడ్డి భారీ విజయం

saidieddy trs

హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ భారీ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 43,284 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌ పద్మావతిరెడ్డిపై గెలుపొందారు. మొత్తం 22 రౌండ్లలోనూ సైదిరెడ్డినే ఆధిక్యం ప్రదర్శించారు. ఏ రౌండ్‌లోనూ కూడా పద్మావతి లీడ్‌లో లేకుండా పోయింది.

తొలి రౌండ్‌ నుంచి సైదిరెడ్డి ఆధిక్యం ప్రదర్శిస్తూ భారీ మెజార్టీతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. హుజూర్ నగర్ లో తొలిసారిగా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్‌ అభ్యర్థి పద్మావతి రెండో స్థానానికి పరిమితం కాగా, మూడో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి సపావత్‌ సుమన్‌ నిలిచాడు. బీజేపీ, టీడీపీ డిపాజిట్లు గల్లంతయ్యాయి. భారీ మెజార్టీతో గెలుపొందిన సైదిరెడ్డికి టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబురాల్లో మునిగిపోయారు.

Related posts