telugu navyamedia
తెలంగాణ వార్తలు

‘స్వాప్నికులు – సాధకుడు’ పుస్తకాన్నిఆవిష్క‌రించిన కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ఉద్యమ తీరు, కీలక ఘట్టాలు, ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన మన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నాయకత్వ పటిమ పై సీనియర్ జర్నిలిస్టు ఎం.నాగశేష కుమార్ రాసి ప్రియతమ నాయకుడు ఎం.ఎల్.సి. పురాణం సతీష్ కుమార్, సునంద దంపతులకు అంకితమిచ్చిన ‘స్వాప్నికులు – సాధకుడు’ పుస్తకాన్ని ఐటి మంత్రి కె.టి.రామారావు ఆవిష్కరించారు.

మంగళవారం, 4 జనవరి 22 నాడు ప్రగతి భవన్ లో ఎం.ఎల్.సి. పురాణం సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర నాయకులకు సంబంధించిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీ తదితర నాయకులు ఉన్నారు.

Related posts