telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో … మంటలు

telangana express met with fire accident

దేశ రాజధానికి వెళ్లే తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. ప్యాంట్రీ కోచ్ కి అంటుకున్న మంటలు, థర్డ్ ఏసీ బీ1, స్లీపర్ క్లాస్ ఎస్ 10 బోగీకి వ్యాపించాయి. రైలు హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీ సమీపంలోకి రైలు చేరుకున్న వేళ, ప్రమాదవశాత్తూ ప్యాంట్రీ కారులో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో రైలు వేగంగా వెళుతుండటంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయని సమచారం.

వెంటనే గుర్తించిన రైలు సిబ్బంది, నిప్పంటుకున్న బోగీలను రైలు నుంచి వేరు చేశారు. మరో గంటలో రైలు గమ్యానికి చేరుతుందనగా ఫరీదాబాద్ జిల్లాలో ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టమూ జరగలేదని తెలుస్తోంది. ఘటనపై విచారణకు ఆదేశించినట్టు అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Related posts