దేశ రాజధానికి వెళ్లే తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. ప్యాంట్రీ కోచ్ కి అంటుకున్న మంటలు, థర్డ్ ఏసీ బీ1, స్లీపర్ క్లాస్ ఎస్ 10 బోగీకి వ్యాపించాయి. రైలు హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీ సమీపంలోకి రైలు చేరుకున్న వేళ, ప్రమాదవశాత్తూ ప్యాంట్రీ కారులో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో రైలు వేగంగా వెళుతుండటంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయని సమచారం.
వెంటనే గుర్తించిన రైలు సిబ్బంది, నిప్పంటుకున్న బోగీలను రైలు నుంచి వేరు చేశారు. మరో గంటలో రైలు గమ్యానికి చేరుతుందనగా ఫరీదాబాద్ జిల్లాలో ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టమూ జరగలేదని తెలుస్తోంది. ఘటనపై విచారణకు ఆదేశించినట్టు అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.