telugu navyamedia
రాజకీయ వార్తలు

భవిష్యత్ కార్యాచరణపై మిత్రపక్షాలతో చర్చిస్తాం: శరద్ పవార్

Loksabha Elections MP Contest Sharad pawar

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ అంగీకరించారు. బీజేపీ, శివసేన కూటమి విజయం దిశగా దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో శివసేనతో తాము కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలపై వస్తున్న ప్రచారంపై శరద్ పవార్ స్పందించారు. మేము శివసేనతో కలవబోమని స్పష్టం చేశారు. మా భవిష్యత్ కార్యాచరణపై ఎన్సీపీ, కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలతో  చర్చించి, నిర్ణయం తీసుకుంటామని  తెలిపారు.

తమ పార్టీని వీడి బీజేపీలో చేరిన వారిపై శరద్ పవార్ విమర్శలు గుప్పించారు. తమ పార్టీని వదిలి వెళ్లిన వారిని ప్రజలు మళ్లీ గెలిపించలేదని అన్నారు. వారికి ఫిరాయింపులు ఏ మేలూ చేయలేకపోయాయని తెలిపారు. అధికారంలో ఉన్న వారి అహంకారాన్ని ప్రజలు ఉపేక్షించబోరని ఈ ఫలితాలు తెలుపుతున్నాయని వ్యాఖ్యానించారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 102, శివసేన 61 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఆ ఇరు పార్టీలు కలిపి 163 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మరోవైపు ఎన్సీపీ 54, కాంగ్రెస్ 41, స్వతంత్ర అభ్యర్థులు 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

Related posts