telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీవీ9 కెమెరామెన్‌ మృతి పట్ల కన్నా ఆవేదన

Kanna laxminarayana

టీవీ9 కెమెరామెన్ మురళీ ప్రసాద్ నిన్న విజయవాడలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. మురళీ ప్రసాద్ మృతి తనను తీవ్రంగా కలచి వేసిందని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

కెమెరామెన్ ప్రసాద్ లేని లోటు ఆయన కుటుంబానికి తీర్చలేనిదని చెప్పారు. మురళీ ప్రసాద్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని కన్నా ట్విటర్ లో పేర్కొన్నారు.

Related posts