దేశంలోని ఎన్ఐడీ కాలేజీల్లో బ్యాచిలర్ డిప్లొమా (బీడీ), గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ డిజైన్ (జీడీపీడీ) కోర్సుల్లో ప్రవేశాలకోసం నిర్వహించిన ఎన్ఐడీ డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (డీఏటీ) మెయిన్స్ ఫలితాలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ) విడుదల చేసింది.
ఫలితాలను అధికారిక వెబ్సెట్ admission.nid.edu లేదా nid.edu/NIDA2020/Result చూడవచ్చని పేర్కొంది. ఎన్ఐడీ డీఏటీ ప్రిలిమ్స్కి 70 శాతం, మెయిన్స్కు 30 శాతం వెయిటేజీ ఉంటుందని ప్రకటించింది. ఈ ప్రవేశపరీక్ష ద్వారా ఆంధ్రప్రదేశ్, అసోం, హర్యానా, మధ్యప్రదేశ్లోని ఎన్ఐడీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.