ఉయ్యాల జంపాల సినిమాతో ప్రేక్షకులకి పరిచయం అయిన రాజ్ తరుణ్ తరువాత మంచి మంచి కథలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. కానీ గత కొంత కాలంగా వరుస పరాజయాలను చవిచూస్తున్న సమయంలో విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో ఒరేయ్ బుజ్జిగా అంటూ కొత్త కాన్సెప్ట్తో సినిమా చేసి హిట్ అందుకున్నాడు. అయితే వీరిద్దరి కాంబోలో మరో సినిమా రూపొందుతుంది. ఈ సినిమాను గత నెల 14న ప్రకటించారు. పవర్ ప్లే అనే పేరుతో అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ మొదలైందా లేదా అనేది కూడా ఎవరికీ తెలీదు. కానీ తాజాగా ఈ రోజు ట్రైలర్ రిలీజ్ అంటూ అందరినీ షాక్కు గురిచేశారు. పవర్ ప్లే ట్రైలర్ను ఈ రోజు ఉదయం 9గంటల 15నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ను విడుదల చేశారు. అయితే దర్శకుడు విజయ్ ‘పవర్ ప్లే’ సినిమా కన్నా ముందు కన్నడలో ‘రైడర్’ అనే సినిమా చేస్తున్నాడు. మరి పవర్ ప్లే సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేశాడు అనేది తెలీదు. కానీ సినిమాను శరవేగంతో పూర్తి చేసి ట్రైలర్ రిలీజ్ చేసేందుకు సిద్దమయ్యాడు. చూడాలి మరి ఈ సినిమా ఏం చేస్తుంది అనేది.
previous post
next post