telugu navyamedia
సినిమా వార్తలు

జగన్, చిరు భేటీకి ముహూర్తం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో తెలుగు సినిమా ప్రముఖులు సమావేశం కాబోతున్నారు .
చాలా కాలంగా జగన్ మోహన్ రెడ్డితో చిరంజీవి తదితరులు కలసి ప్రస్తుతం తెలుగు సినిమా ఎదుర్కొంటున్న సమస్యలను చర్చిస్తారని చెబుతున్నారు . ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా చిరంజీవితో సమావేశం అవుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి . జగన్ మోహన్ రెడ్డి ని కలిసినప్పుడు ప్రధానంగా ఏఏ అంశాలను చర్చించాలననే దానిపై చిరంజీవి ఇంట్లో ఓ సమావేశం కూడా నిర్వహించారు . అయితే దీనిపైన సినిమా రంగంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ,అది వేరే సంగతి.

tollywood Archives | Page 5 of 8 | Telugu360.com

అయితే ఈ లోపలే సినిమా టిక్కెట్లు అమ్మడానికి ప్రభుత్వం ఒక పోర్టల్ ను రూపొందించబోతుందనే వార్త వచ్చింది . ఇందుకు సినిమా వారితో ప్రమేయం లేకుండా ఓ కమిటీని కూడా వేశారు . ఆంధ్ర ప్రదేశలో విడుదలయ్యే సినిమా చూడాలనుకునే ప్రేక్షకుడు ఈ పోర్టల్ ద్వారానే టికెట్ కొనుగోలు చెయ్యాలి . ఇలా వసూలైన డబ్బంతా ప్రభుత్వం దగ్గరే ఉంటుంది . నెలకు ఒక్కసారి ఈ డబ్బును నిర్మాత , పంపిణీదారు ఖాతాలో జమచేస్తారట .

Chiranjeevi To Meet Jagan On Monday

ఇది తెలిసి తెలుగు సినిమా రంగం నివ్వెరపోయింది . సినిమా మీద ప్రభుత్వ పెత్తనం ఏమిటని మండిపడ్డారు . అయితే దీనిపై మీడియాకు ఎక్కే సాహసం మాత్రం ఎవరూ చెయ్యలేదు . ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిరంజీవితో సమావేశానికి ముహూర్తం నిర్ణయించి వర్తమానం పంపారు . ఈ నెల 20న విజయవాడలో జగన్మోహన్ రెడ్డి ని చిరంజీవితో పాటు కొంతమంది నిర్మాతలు, దర్శకులు కలుస్తారని సమాచారం . మరి ఈ సమావేశం లో ఏఏ అంశాలు చర్చకు వస్తాయో , వేటిని ప్రభుత్వం అంగీకరిస్తుందో చూడాలి .

Related posts