telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

ముత్తూట్ ఫైనాన్స్ లో భారీ చోరీ.. 77 కిలోల బంగారం దోచుకెళ్లిన దొంగలు

muthoot finance into mutual funds soon

కర్ణాటకలోని ఓ ముత్తూట్ ఫైనాన్స్ శాఖలో భారీ చోరీ జరిగింది. బెంగళూరు, పులకేశినగర్ సమీపంలోని లింగరాజపురం బ్రిడ్జి వద్ద ఉన్న ముత్తూట్‌ ఫైనాన్స్‌ కార్యాలయంలోకి ప్రవేశించిన దొంగలు ఏకంగా 77 కిలోల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. అత్యంత చాకచక్యంగా గోడకు కన్నమేసి లోపలికి వెళ్లిన దొంగలు చోరీకి పాల్పడ్డారు.

పోలీసులకు ఆధారాలు చిక్కకుండా సీసీ కెమెరాలను తొలగించారు. ఆపై నగలు దాచివుంచే బీరువాలను గ్యాస్ కట్టర్లతో కత్తిరించి, దోపిడీకి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు దొంగతనం జరిగిన తీరుపై ఆరాతీశారు. లోపలి పరిస్థితుల గురించి తెలిసిన వ్యక్తుల ప్రమేయం ఉండవచ్చన్న కోణంలో విచారణ చేపట్టారు.

Related posts