telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

పట్టాలెక్కిన ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్‌ లో ప్రయాణీకుల సందడి

train secunderabad

లాక్ డౌన్ నిబంధనలో సడలింపులివ్వడంతో దాదాపు రెండున్నర నెలల తర్వాత ప్రత్యేక రైళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో మళ్లీ కళకళలాడుతోంది. నేటి నుంచి రైళ్లు మళ్లీ ప్రారంభం కావడంతో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్‌కు చేరుకుంటున్నారు. రైలు బయలుదేరే సమయానికి 90 నుంచి 120 నిమిషాల ముందే స్టేషన్‌కు చేరుకోవాలన్న నిబంధన మేరకు ముందే తరలివస్తున్నారు. వందల సంఖ్యలో వస్తున్న ప్రయాణికులతో క్యూ రోడ్డుపైకి వచ్చేసింది.

స్టేషన్‌లో ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా నేలపై గుర్తులు వేశారు. స్టేషన్‌కు చేరుకున్న ప్రయాణికులకు పరీక్షల అనంతరం ఎటువంటి లక్షణాలు లేకుంటేనే లోపలికి పంపిస్తారు. కాగా, ఈ నెల 29 నుంచి తత్కాల్ టికెట్లు కూడా జారీ చేయనున్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్‌ స్టేషన్లలోని ఫుడ్‌కోర్టులు, ఇతర దుకాణాలు తెరుచుకున్నప్పటికీ పార్శిళ్లకు మాత్రమే అనుమతించారు.

Related posts