భారత వాయుసేన పైలెట్లు పాకిస్థాన్ సరిహద్దుల్లోని జేషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై ఈ తెల్లవారుజామున బాంబుల వర్షం కురిపించారు. పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాలైన ముజప్ఫర్ నగర్ ప్రాంతాల్లోని ఉగ్రవాదుల శిబిరాలపై భారత వాయుసేన పైలెట్లు 21 నిమిషాల పాటు బాంబుల వర్షం కురిపించారు. ఈ దాడుల్లో 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. భారత వాయుసేన జరిపిన రెండో సర్జికల్ స్ట్రయిక్స్ పై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా దీనిపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. ‘భారత వాయుసేనను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. భారత వాయు సేనకు చెందిన ధైర్యశాలురైన పైలట్స్కి సెల్యూట్’ అని ట్వీట్ చేశారు.
previous post