telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ కేసీఆర్ సొంత జాగీరు కాదు…

ponnam prabhakar fire on ktr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  తెలంగాణ కేసీఆర్ సొంత జాగీరు కాదని ఫైర్ అయ్యారు. మొక్కజొన్నలకు క్వింటాలుకు 1850 రూపాయలు కనీస మద్దతు ధర ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని గుర్తు చేశారు. మొక్కజొన్న కొనడం కుదరదని చెప్పడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. రైతు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొంటుంది అన్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

మొక్కజొన్న కొనమంటే రైతులు కూడా టిఆర్ఎస్ కు ఓటు వేయమని తీర్మానం చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కేసీఆర్ రైతుల పట్ల అహంకారంగా మాట్లాడటం మానుకోవాలని సూచించారు. మీరు చెప్పినట్లు రైతులు పంటలు వేస్తారనుకోవడం అవివేకమని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రకటన పై కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు పొన్నం ప్రభాకర్. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. దుబ్బాక కాంగ్రెస్ విజయం ధీమా వ్యక్తం చేసారు. 

Related posts