telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ప్రజలను హింసించే రాజు జగన్ : నారా లోకేష్

Nara Lokesh

దొండపాడు లో నారా లోకేష్ మాట్లాడుతూ… హింసించే రాజు జగన్ రెడ్డి మాట తప్పి, మడమ తిప్పి 300 రోజులు అయ్యింది. రాజధాని కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న అందరకీ ధన్యవాదాలు. శాసన సభలో చర్చ లోనే 30వేల ఎకరాలు రాజధానికి కావాలని జగన్ చెప్పారు. అన్ని ప్రాంతాలకు సమదూరంలోనే రాజధాని ఉండాలన్నారు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనుకోవడం లేదని చెప్పిన‌ వ్యక్తి జగన్ రెడ్డి అధికారంలోకి వస్తే బాధ్యత పెరగాలి.. కానీ జగన్ కు, మంత్రులు కు బలుపు పెరిగింది అని తెలిపారు.

రైతులు అయితే విమానం ఎక్కితే తప్పా, జగన్ లాగా కేసులు గురించి‌ మాట్లాడటానికి వారు ఫ్లైట్లు ఎక్కలేదే. అమరావతి కోసం న్యాయం‌ చేయాలని కోరేందుకు ఢిల్లీ వెళ్లారు అని అన్నారు. జగన్ ను ఎవరూ నమ్మకపోవడం‌ చేతే.. రాజధానిలో ఇల్లు కట్టుకున్నాడు. జగన్ ఇల్లు కట్టాడు.. రాజధాని పోదు అని నమ్మే ప్రజలు గెలిపించారు. చంద్రబాబు చాలా చేశాడు.. జగన్ ఇంకా ఏదో‌ చేస్తారనుకున్నారు. కానీ పసి బిడ్డ లాంటి అమరావతి ని చంపి ప్రజలను మోసం‌ చేశాడు అని తెలిపారు. రాజధాని పై ఇన్ని కుట్రలు చేసి.. మోసం చేయడం జగన్ రెడ్డి కే చెల్లింది. ఎప్పుడూ‌ బయటకు రాని మహిళలు, రైతులను రోడ్డెక్కించారు. అలా అమరావతి సాధించే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది అని లోకేష్ తెలిపారు.

Related posts