telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

దారుణం : రోడ్డు ప్రమాదంలో ప్రేమికులు మృతి

Accident

చౌటుప్పల్ లో కారు బీభత్సం సృష్టించింది. స్కూటీపై వెళుతున్న వారిని కారు ఢీ కొట్టింది. కారు ఢీకొనడంతో అక్కడికక్కడే వాహనం తగల పడిపోయింది. అయితే.. ఈ కారు ప్రమాదంలో ఓ ప్రేమ జంట మృతి చెందింది. ఈ ప్రమాదం జరిగిన చోట యువతి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలైన ఆ యువకున్ని అక్కడే ఉన్న స్థానీకులు ఓ ప్రైవేట్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న ఆ యువకుడు పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అక్కడే ఉన్న స్థానికులను ఆ ప్రమాదానికి సంబందించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకునేందుకు కొండ గట్టుకు ఆ ప్రేములు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతి చెందిన ఆ ప్రేమికులు రంగారెడ్డి జిల్లా మన్నెగూడకు చెందిన వాసులుగా గుర్తించారు పోలీసులు. ఈ ప్రమాదానికి కారణమైన కారు యజమానిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Related posts