telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

దేశంలో కరోనా విజృంభణ..ఇవాళ మరో

corona vaccine covid-19

దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 78 లక్షలు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 50,129 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా…కరోనా వల్ల మొత్తం 578 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 62,077 డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 78,64,811కాగా ….దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 6,68,154 గా ఉన్నాయి. ఇక కరోనా కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 70,78,123 కి చేరింది. “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,18,534 నమోదైంది. ఇటు దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 90శాతంగా ఉండగా… దేశంలో నమోదయిన మొత్తం కేసులలో “యాక్టివ్” కేసులు 8.71శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.51 శాతానికి మరణాల రేటు తగ్గింది. ఇటు గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా నిర్వహించిన “కరోనా” టెస్ట్ ల సంఖ్య 11,40,905 కు చేరింది.

Related posts