“శ్రీనివాస కళ్యాణం” చిత్రం అనుకున్న విజయాన్ని అందించకపోవడంతో తర్వాత సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు యంగ్ హీరో నితిన్. ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కుతోంది “భీష్మ”. “సింగిల్ ఫర్ ఎవర్” అనేది ఉపశీర్షిక. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 21న ఈ సినిమా విడుదలవుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో హీరో నితిన్ తన సినిమాలోని తొలి అప్డేట్ ఇచ్చారు. ఫస్ట్ సాంగ్ను డిసెంబర్ 27న విడుదల చేయబోతున్నట్లు ఈయన ప్రకటించారు. “ఇది కేవలం పాట మాత్రమే కాదు.. ఇది మా గీతం, మా ఎమోషన్” అంటూ నితిన్ ట్వీట్ చేశారు. సాగర్ మహతి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
previous post