telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నిమ్స్‌ డైరెక్టర్‌ పదవీకాలాన్ని పొడగించిన ప్రభుత్వం

Nims hyderabad

హైదరాబాద్ నిమ్స్‌ డైరెక్టర్‌ కే మనోహర్‌ పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఏ శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు. నిమ్స్‌ డైరెక్టర్‌గా మనోహర్‌ 2015లో బాధ్యతలు చేపట్టగా, ఈ నెల 26తో ఆయన పదవీకాలం ముగియనుంది.

పొడిగింపు నిర్ణయంతో తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఆయనే నిమ్స్‌ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. పదవీకాలం పొడిగింపుపై ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఏ సత్యగౌడ్‌, నిమ్స్‌ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మంచికట్ల రాజ్‌కుమార్‌, శరత్‌, గోపాల్‌రెడ్డి తదితరులు డైరెక్టర్‌ మనోహర్‌కు అభినందనలు తెలిపారు.

Related posts