కరోనా వైయరస్ రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాము కరోనా బారిన పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో, ఓ వ్యక్తి రూ. 500 నోటుతో ముక్కు తుడుచుకున్న ఒక వీడియో జనాల్లో తీవ్ర ఆందోళనను కలిగించింది.
దీంతో, కర్ణాటక మండ్య జిల్లాలోని మరనచకనహల్లి గ్రామస్తులు కరెన్సీ నోట్లను కూడా శుభ్రం చేసుకుంటున్నారు. 100, 500, 2000 విలువైన నోట్లను సబ్బు నీటితో కడిగి ఆరబెడుతున్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, పంట అమ్మగా వచ్చిన డబ్బును ఈ విధంగా శుభ్రం చేస్తున్నామని చెప్పారు. దీని వల్ల వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని తెలిపారు. దీనిపై అధికారులు స్పందిస్తూ భయంతోనే వారు ఇలా చేస్తున్నారని తెలిపారు.