telugu navyamedia
రాజకీయ వార్తలు

ఢిల్లీలో కరోనా వ్యాప్తి కట్టడి..ఆసుపత్రులపై తగ్గిన ఒత్తిడి: కేజ్రీవాల్

arvind-kejriwal

కరోనా వైరస్ తో వణికిపోయిన ఢిల్లీలో ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలు వివరాలు తెలిపారు. ఈ నెల 23 నుంచి ఆసుపత్రుల్లో పడకల ఆక్యుపెన్సీ చాలా వరకు పడిపోయిందని చెప్పారు. ఇంతకు ముందుతో పోల్చి చూస్తే ప్రస్తుతం తక్కువ మందికి కరోనా సోకుతోందని చెప్పారు. అతి తక్కువ మందికే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉందని వివరించారు. దీంతో ప్రస్తుతం కరోనా ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతోందన్నారు.

తాజా గణాంకాల ప్రకారం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి కేసుల్లో ఢిల్లీ ఎనిమిదో స్థానంలో ఉందని తెలిపారు. ఇటీవల ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వైరస్‌ను ఎదుర్కొనే చర్యలను చేపట్టామని అన్నారు. దీంతో దాని వ్యాప్తిని నిలువరించామని చెప్పారు. ఢిల్లీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Related posts