telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అప్పుల్లో ఆంధ్రప్రదేశ్‌ ఆరో స్థానం: యనమల

Yanamala tdp

అప్పుల్లో ఆంధ్రప్రదేశ్‌ ఆరో స్థానంలో ఉందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో ఇప్పటికే చేసిన అప్పుల కారణంగా.. 2024కు వడ్డీ, అసలు చెల్లింపులకే రూ.లక్ష కోట్లు చెల్లించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

వైసీపీ నేతల అసమర్థ పాలన కారణంగా ఏపీ క్రెడిట్‌ రేటింగ్‌ దారుణంగా పడిపోయిందని తెలిపారు. ఈ కారణాల వల్ల రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశాలున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్‌, రివర్స్‌ గ్రోత్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ చరిత్ర సృష్టించారని ఆయన చురకలంటించారు. జగన్‌ పాలనలో తప్పొప్పుల సమీక్షకు తావు లేకుండా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలో భూముల వేలాన్ని బిల్ట్‌ ఏపీ మిషన్‌ అని పేర్కొనడం కన్నా బిల్ట్‌ వైసీపీ మిషన్ అని పేర్కొంటే బావుంటుందన్నారు.

Related posts