telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనా​పై ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు వద్దు.. మంత్రులకు మోదీ హెచ్చరిక

one nation one day salary slogan by modi

కరోనా వైరస్ నివారణకు సంబంధించి ఇష్టమొచ్చిన రెమెడీలు పాటించడం, ప్రచారం చేయడం వద్దని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి వచ్చిన మార్గదర్శకాలు, సూచనలు పాటించాలని సూచించారు.

కరోనా వైరస్ నివారణకు ఆవు మూత్రం పనిచేస్తుంది, మరేదో పనిచేస్తోదంటూ బీజేపీ మంత్రులు, నేతలు మాట్లాడుతుండటంపై ప్రధాన మోదీ అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలు, చర్యలపై తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మోదీ స్పందించారు. అయితే ఈ విషయాలను నేరుగా ప్రస్తావించకుండానే మంత్రులు, బీజేపీ లీడర్లకు పలు హెచ్చరికలు జారీ చేశారు.

Related posts