హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్ష ఎన్నికల్లో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన తన కార్యవర్గంతో అజర్ సీఎం కేసీఆర్ ను కలవనున్నారు. విజయానంతరం అజర్ మాట్లాడుతూ, రాష్ట్రానికి బాస్ కేసీఆర్ అని అభివర్ణించారు. హెచ్ సీఏ ఎన్నికలు నియమ నిబంధనలకు లోబడి జరిగాయని అన్నారు. ఎలాంటి లోపాలు లేవని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ లో చేరతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అజర్ గతంలో ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా పార్లమెంటుకు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన త్వరలో పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. పార్టీ మార్పుపై మీడియా ప్రశ్నించగా ఇప్పుడేమీ మాట్లాడలేనని అజర్ స్పష్టం చేశారు. ఇది క్రికెట్ వ్యవహారమని, రాజకీయరంగం కాదని అజర్ అన్నారు.