telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

కన్న కొడుకునే హతమార్చిన తల్లి…

మన ప్రపంచంలో తల్లికి చాలా గౌవరవం ఉంది. పురాణాల్లో కూడా తల్లి గురించి ఎంతో గొప్పగా చెప్పారు. అయితే వికారాబాద్ జిల్లాలో దారుణ హత్య ఒకటి వెలుగులోకి వచ్చింది. కొడుకుని సొంత కన్న తల్లి సుపారీ ఇచ్చి చంపించిన అంశం వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలం పులుమద్ది గ్రామానికి చెందిన శివ ప్రసాద్  ఈ నెల 7 నుండి కనిపించడం లేదు. అయితే అతను ఈ రోజు సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పీచరగాడి తండా దగ్గర దారుణ హత్యకు గురయ్యాడు. శివ ప్రసాద్ వయసు 17 సంవత్సరాలు. అతన్ని కన్న తల్లి సుపారీ ఇచ్చి చంపించినట్టు సమాచారం. తాగి వచ్చి తల్లిని ఇబ్బంది పెడుతున్న కారణంతో హత్య చేయించడానికి సిద్దం అయింది.  తమ్ముడితో కలిసి తల్లి తన కుమారుడుని హత్య చేసినట్టు గుర్తించారు పోలీసులు. తల్లితో పాటు మేన మామను  అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు వికారాబాద్ పోలీసులు. పంచనామా చేసి అక్కడే శవాన్ని పూడ్చి పెట్టారు పోలీసులు. శివ ప్రసాద్ హత్య కేసులో 6 మంది నిందితులని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts