జపాన్ మాజీ ప్రధాని యశుహిరో నకసోనే కన్నుమూశారు. ఆయన వయసు 101 ఏళ్లు. 1982 నుంచి 1987 మధ్య ప్రధానిగా పనిచేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఓటమితో కుదేలైన జపాన్ను తిరిగి గాడిన పెట్టడంలో కీలకపాత్ర పోషించారు. ఆ యుద్ధంలో అమెరికా చేతిలోనే జపాన్ ఓడిపోయినప్పటికీ, తిరిగి ఆ దేశంతోనే సంబంధాలు బలోపేతమయ్యేందుకు చొరవ తీసుకున్నారు. ఈ విషయంలో వచ్చిన విమర్శలను పట్టించుకోలేదు.
అమెరికా అధ్యక్షుడిగా రొనాల్డ్ రీగన్ ఉన్నప్పుడు ఆ దేశానికి రక్షణ రంగ సాంకేతిక పరిజ్ఞానాన్ని బదలాయించడం గమనార్హం. రీగన్ ఆర్థిక సిద్ధాంతాల ప్రభావంతో దేశంలోని రైల్వే, టెలికాం రంగాలను ప్రైవేటీకరించారు. నకసోనే మృతికి భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావడానికి కృషి చేశారని గుర్తుచేశారు.
దోపిడీదారులు నిప్పు కణికల్లా బిల్డప్ ఇస్తుంటారు: విజయసాయిరెడ్డి