పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. తెల్లవారితే పెళ్లి జరగాల్సి ఉండగా వధువుకు కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో వివాహం ఆగిపోయింది. కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఈ ఘటన జరిగిందీ . స్థానిక చెంచుకాలనీకి చెందిన యువతికి ఈ నెల 25 వివాహం నిశ్చయమైంది.
కొవిడ్ నిబంధనల ప్రకారం పెళ్లికి మూడు రోజుల ముందు వధూవరులిద్దరూ కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. నిన్న ఉదయం వచ్చిన రిపోర్టుల్లో వధువుకు కరోనా సోకినట్టు తేలింది. దీంతో అధికారులు వెంటనే ఆమె ఇంటికి చేరుకుని విషయం చెప్పారు. దీంతో చేసేదేమీ లేక ఇరు కుటుంబాలు పెళ్లిని వాయిదా వేసుకున్నాయి.
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. పెళ్లి తంతులో భాగంగా గురువారం యువకుడిని పెళ్లి కుమారుడిని చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. అదే సమయంలో అతడికి కరోనా సోకినట్టు రిపోర్టులు రావడంతో పెళ్లిని వాయిదా వేసుకున్నారు.
కేసీఆర్, కేటీఆర్ నిర్వహించిన శాఖలు చివరిస్థానంలో ఉన్నాయి: రేవంత్ రెడ్డి