ప్రపంచ దేశాలను అతాలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ఉత్తరకొరియాకు వ్యాపించింది. ఆ దేశంలో తొలి కరోనా కేసు నమోదైంది. నిన్న రాత్రి కరోనా లక్షణాలున్న ఓ వ్యక్తికి పరీక్షలు చేయగా పాజిటివ్గా నిర్ధారణ అయిందని ఉత్తరకొరియా అధికారికంగా ప్రకటించింది. దేశంలో తొలి కేసు కరోనా కేసు నమోదు కావడంతో కేసాంగ్ నగరంలో లాక్డౌన్ విధించారు.
కరోనా కేసు నమోదు కావడంతో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. కరోనా లక్షణాలున్న ప్రతి ఒక్కరిని గుర్తించి పరీక్షలు నిర్వహించాలని, అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు.
దేశ వ్యాప్తంగా మొత్తం 976 పరీక్షలు నిర్వహించామని, ఏ ఒక్కరినీ కరోనా పాజిటివ్గా తేలలేదని అధికారులు కిమ్ జోంగ్ ఉన్కు చెప్పారు. అలాగే, కరోనా లక్షణాలున్న 25,551 మందిని క్వారంటైన్లో ఉంచామని వారు వివరించారు. ఈ విషయాలన్నింటినీ ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియజేశామని వెల్లడించారు.
దేశంలో తొలి కేసు నమోదైన నేపథ్యంలో సంబంధిత అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కిమ్ జోంగ్ ఉన్ సూచనలు చేశారు. చైనా సరిహద్దులను ఇప్పట్లో తెరవబోమని కిమ్ అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు 30 రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాలని ఆయన నిబంధనలు విధించారు. మరోవైపు దక్షిణ కొరియాలోనూ ప్రతిరోజు పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.
కేసీఆర్ పాలనలో విద్యావ్యవస్థ నిర్వీర్యం: జీవన్రెడ్డి