telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్‌, కేటీఆర్‌ నిర్వహించిన శాఖలు చివరిస్థానంలో ఉన్నాయి: రేవంత్ రెడ్డి

Revanth-Reddy mp

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి విమర్శనాస్త్రాలు సందించారు. ఈరోజు ఢిల్లీలో ఆయన మీడియాతోమాట్లాడుతూ కేసీఆర్ పాలనలో తెలంగాణ కుళ్లిపోయిందని విమర్శించారు. గత ఐదేళ్లలో శాఖల పనితీరుపై ప్రధాన కార్యదర్శి ర్యాంకులు ఇచ్చారని, ఈ ర్యాంకుల్లో కేసీఆర్, కేటీఆర్ నిర్వహించిన శాఖలు చివరి స్థానంలో ఉన్నాయని చెప్పారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలకు అందడం లేదనే విషయాన్ని తాము లేవనెత్తుతూనే ఉన్నామని తెలిపారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తన నివేదికల ద్వారా స్పష్టంగా చెప్పారని అన్నారు.

 విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో ఐఏఎస్ అధికారులను నియమించాలని డిమాండ్ చేశారు. న్యూయార్క్ లో కాళేశ్వరం ప్రాజెక్టుపై యాడ్ వేసుకుంటే, అది టీఆర్ఎస్ ప్రభుత్వ గొప్పదనంగా చెప్పుకుంటున్నారని విమర్శించారు.అవార్డులు, రివార్డులను కొనుక్కుని గోబెల్స్‌ ప్రచారం చేసుకున్నారని ఆయన ఆరోపించారు. 

Related posts